‘సచివాలయం కూల్చివేతపై కాసేపట్లో హైకోర్టు నోటీసులు అందుతాయి’

ABN , First Publish Date - 2020-07-10T19:23:14+05:30 IST

హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై కాసేపట్లో హైకోర్టు నోటీసులు.. సీఎస్‌కు అందుతాయని..

‘సచివాలయం కూల్చివేతపై కాసేపట్లో హైకోర్టు నోటీసులు అందుతాయి’

హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై కాసేపట్లో హైకోర్టు నోటీసులు.. సీఎస్‌కు అందుతాయని.. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తెలిపారు. ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పాత భవనాలను మాత్రమే కూల్చటానికి హైకోర్టు అంగీకరించిందన్నారు. సచివాలయంలోని నూతన భవనాలను సైతం కూల్చాలనుకోవటం హైకోర్టు ధిక్కరణేనన్నారు. సచివాలయాన్ని కాపాడుకోవటానికి సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. సోమవారం హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తోందన్న నమ్మకం ఉందని విశ్వేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-07-10T19:23:14+05:30 IST