బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై స్టేకు హైకోర్టు నో
ABN , First Publish Date - 2020-08-07T08:00:36+05:30 IST
విశ్వాస పరీక్ష గడువు ముంచుకొస్తున్న తరుణంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు గొప్ప ఊరట లభించింది...
జైపూర్, ఆగస్టు 6: విశ్వాస పరీక్ష గడువు ముంచుకొస్తున్న తరుణంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు గొప్ప ఊరట లభించింది. ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన బీఎస్పీ శాసనసభా పక్షం కాంగ్రెస్లో విలీనం కావడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ బీఎస్పీ పెట్టుకున్న పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. విలీనాన్ని సవాలుచేస్తూబీఎస్పీ దాఖలు చేసిన మరో పిటిషన్ మీద విచారణను ఏకసభ్య ధర్మాసనానికి వదిలేసింది. ఆ విచారణ ఆగస్టు 11న జరగనుంది.