రేషన్ డీలర్లకు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-01-08T20:56:32+05:30 IST

రేషన్ డీలర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని డీలర్లకు ప్రభుత్వానికి సూచించింది.

రేషన్ డీలర్లకు హైకోర్టులో ఊరట

అమరావతి: రేషన్ డీలర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని డీలర్లకు ప్రభుత్వానికి సూచించింది. దశాబ్దాలుగా కమిషన్‌తో పాటు, గోనె సంచుల ద్వారా రేషన్ డీలర్లు ఆదాయం పొందుతున్నారు. తాజాగా గోనె సంచులుకు డబ్బులు ఇచ్చేది లేదంటూ అధికారుల ఆదేశించారు. నష్టపోతామని డీలర్లు విజ్ఞప్తి చేసినా  అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండాది వెంకట్రావు, మధు, శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. డీలర్ల తరపున హైకోర్టులో  న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని‌ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుపై మండాది వెంకట్రావు, ఇతర సభ్యలు హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-01-08T20:56:32+05:30 IST