వర్సిటీల్లో అధ్యాపక నోటిఫికేషన్లను కొట్టివేసిన హైకోర్టు
ABN , First Publish Date - 2021-03-06T07:54:44+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2015-17 మధ్య అధ్యాపక నియామకాల కోసం వెలువడిన నోటిఫికేషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 5: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2015-17 మధ్య అధ్యాపక నియామకాల కోసం వెలువడిన నోటిఫికేషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎస్వీయూలో అధ్యాపక ప్రక్రియపైనా రెండు పిటీషన్లు అప్పట్లో హైకోర్టులో దాఖలయ్యాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదనీ, ఒక విభాగంలోని అధ్యాపక ఖాళీలను మరో విభాగానికి బదిలీ చేయటం యూజీసీ నియమావళికి విరుద్ధమనీ, కొన్ని విభాగాలను రద్దు చేయడం వంటి పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషనర్లు కొందరు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్వీయూలోనూ చేపట్టిన అధ్యాపక నియామక ప్రక్రియ నోటిఫికేషన్ రద్దు అయ్యింది.