పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

ABN , First Publish Date - 2021-03-04T21:21:51+05:30 IST

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు పేర్కొంది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్‌: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని కోర్టు పేర్కొంది. పీపీల నియామకానికి చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 414 పీపీ పోస్టుల్లో 212 భర్తీ అయ్యాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. చర్చలు కాదు... ఫలితాలు కావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ఏప్రిల్ 1కి వాయిదా పడింది.

Updated Date - 2021-03-04T21:21:51+05:30 IST