బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు
ABN , First Publish Date - 2022-03-10T21:51:04+05:30 IST
సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
హైదరాబాద్: సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్పై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.