ప్రజాప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలి

ABN , First Publish Date - 2020-07-05T07:14:13+05:30 IST

లక్షణాలు లేనప్పటికీ... కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులతో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు అందరికీ కరోనా

ప్రజాప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలి

  • కొవిడ్‌పై హైకోర్టులో అనుబంధ వ్యాజ్యం దాఖలు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): లక్షణాలు లేనప్పటికీ... కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులతో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు అందరికీ కరోనా పరీక్షలు చేయాలని కోరుతూ గతంలో హైకోర్టులో దాఖలైన పిల్‌లో పిటిషనర్లు తాజాగా అనుబంధ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.  ప్రైమరీ కాంటాక్టుల ట్రేసింగ్‌లో ఇప్పటిదాకా అధికారులే పని చేస్తున్నారని, కార్పొరేటర్లు/వార్డు కౌన్సిలర్లను ఇందులో భాగస్వాములను చేయాలని కోరారు. దీన్ని మిగిలిన వ్యాజ్యాలతో జతపర్చి 20న విచారణకు వేయాలని హైకోర్టు ధర్మాసనం రిజిస్ట్రీని  ఆదేశించింది. 

Updated Date - 2020-07-05T07:14:13+05:30 IST