Viveka హత్య కేసు నిందితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-05-20T00:11:22+05:30 IST

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు( AP High Court)లో విచారణ చేపట్టింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వివేకా కేసులో నిందితులు

Viveka హత్య కేసు నిందితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు( AP High Court)లో విచారణ చేపట్టింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వివేకా కేసులో నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌యాదవ్‌ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలంటూ.. గతవారం సీబీఐ (CBI) లాయర్‌ను ఏపీ హైకోర్టు అడిగింది. ఫోరెన్సిక్‌ నివేదికలు రావాల్సి ఉందని సీబీఐ తరపు లాయర్ తెలిపారు. ఈ నివేదికలు కూడా రావాల్సి ఉండడంతో.. రెగ్యూలర్‌ కోర్టులో విచారణ జరుగుతుందని ఏపీ హైకోర్టు పేర్కొన్నారు. తదుపరి విచారణ జూన్ 13కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-05-20T00:11:22+05:30 IST