పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-10-09T03:04:14+05:30 IST

నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లపై ఏపీ హైకోర్టు కీలక

పేదలందరికీ ఇళ్ల పథకంపై  హైకోర్టు కీలక ఉత్తర్వులు

అమరావతి: నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని  హైకోర్టు ఆదేశించింది. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలాన్ని కేటాయించడాన్ని హైకోర్టు  తప్పుపట్టింది. గృహ నిర్మాణంపై ఏపీ హైకోర్టును 128 మంది పిటిషనర్లు ఆశ్రయించారు. 108 పేజీల తీర్పును హైకోర్టు వెల్లడించింది. గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోలలోని పలు నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని హైకోర్టు వెల్లడించింది. 

Updated Date - 2021-10-09T03:04:14+05:30 IST