వృద్ధులను ఆదుకుంటా: న్యాయమూర్తి భరోసా
ABN , First Publish Date - 2021-07-25T06:03:02+05:30 IST
వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకుంటానని హైకోర్టు న్యాయమూర్తి జె.ఉమాదేవి భరోసా ఇచ్చారు.
వృద్ధులను ఆదుకుంటా: న్యాయమూర్తి భరోసా
గుణదల, జూలై 24: వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకుంటానని హైకోర్టు న్యాయమూర్తి జె.ఉమాదేవి భరోసా ఇచ్చారు. గుణదలలోని అమ్మ ఓల్డేజ్ హోమ్ అండ్ కేర్ నర్సింగ్ సర్వీస్ సెంటర్ను హైకోర్టు న్యాయమూర్తి జె.ఉమాదేవి శనివారం సందర్శిం చారు. వృద్ధులను, మానసిక వికలాంగులను పక్షవాత రోగులను ఆమె పరామర్శించారు. ఓల్డ్ ఐరన్ డీలర్స్ మాజీ అధ్యక్షుడు జె.నరసయ్య, బి.సత్యనారాయణ, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి రవికుమార్, సుధీర్ కుమార్ పాల్గొన్నారు.