తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-04-10T01:59:34+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సాంబశివరావు, జస్టిస్‌ నాగార్జున దర్శించుకున్నారు.

తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సాంబశివరావు, జస్టిస్‌ నాగార్జున దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో  ఆలయంలోకి వెళ్లిన వారు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ నేషనల్‌ బ్యాంక్‌(నాబార్డ్‌) చైర్మన్‌ జీఆర్‌ చింతల శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు లడ్డూప్రసాదాలు, క్యాలెండర్‌, డైరీ, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. 

Updated Date - 2022-04-10T01:59:34+05:30 IST