High Court: ఐదుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-08-17T18:00:09+05:30 IST
రాష్ట్ర హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు రాజ్భవన్లోని గ్లాస్హౌస్(Glasshouse)లో మంగళవారం సాయం
బెంగళూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు రాజ్భవన్లోని గ్లాస్హౌస్(Glasshouse)లో మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం బొమ్మై కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అదనపు న్యాయమూర్తుల్లో జస్టిస్ అనిల్ భీమసేనకట్టి, జస్టిస్ గురుసిద్దయ్య బసవరాజ, జస్టిస్ చంద్రశేఖర్ మృత్యుంజయ జోషి, జస్టిస్ ఉమేశ్ మంజునాథ్ భట్ అడిగ, జస్టిస్ తలకాడు గిరిగౌడ ఉన్నారు. కార్యక్రమంలో హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధె తదితరులు పాల్గొన్నారు.