హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం

ABN , First Publish Date - 2022-03-20T22:44:53+05:30 IST

విజయనగరం పట్టణంలో హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌

హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం

విజయనగరం: విజయనగరం పట్టణంలో హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇంకా వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని, పరిశ్రమల స్థాపనకు ఉత్తరాంధ్రలో వనరులు ఎక్కువ అని తెలిపారు. స్వార్థం ఏలుతున్న రాజ్యంలో సమాజానికి అందరూ సేవ చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో 70 శాతం మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారే కావడం గర్వకారణమని జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-20T22:44:53+05:30 IST