చెంగాళమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-11-28T02:57:23+05:30 IST

సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయాన్ని శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె. విజయలక్ష్మి సందర్శించారు.

చెంగాళమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
చెంగాళమ్మ ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మి

సూళ్లూరుపేట, నవంబరు 27 : సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయాన్ని శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె. విజయలక్ష్మి సందర్శించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజలు జరిపించారు. అనంతరం వేదపండితులతో ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు. ఆమెతోపాటు జిల్లా జడ్జి సి. యామిని, నాయుడుపేట ఆర్డీవో సరోజిని, డీఎస్పీ రాజగోపాల్‌, సూళ్లూరుపేట తహసీల్దారు రవికుమార్‌, ఎస్‌ఐలు రవిబాబు, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T02:57:23+05:30 IST