ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు ఆపలేమని తేల్చి చెప్పిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-10-22T23:05:38+05:30 IST

ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు ఆపలేమని తేల్చి చెప్పిన హైకోర్టు

హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. పరీక్షలు రద్దు చేయాలన్న లంచ్ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారించింది. ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైందని, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2021-10-22T23:05:38+05:30 IST