యువకుడి అదృశ్యంపై హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2021-12-15T16:57:34+05:30 IST

తన కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.

యువకుడి అదృశ్యంపై హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

హైదరాబాద్: తన కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బృందావన్ టౌన్ షిప్‌లో నివాసముండే శ్రావణ్ కుమార్ హైకోర్టులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు సాయి కుమార్(20) అక్టోబర్ నెలలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై అతడి తండ్రి శ్రావణ్ కుమార్ ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ యువకుడి ఆచూకీ లభించకపోవడంతో బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2021-12-15T16:57:34+05:30 IST