మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-08-02T22:01:26+05:30 IST

మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టు విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్టుమార్టం పూర్తయిందని

మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్టుమార్టం పూర్తయిందని కోర్టు ఏజీ తెలిపారు. మరియమ్మ కుటుంబానికి రూ.15లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు ఏజీ తెలిపారు. ఈ కేసులో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని కోర్టు ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. నివేదిక అందిన 4వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్‌పై విచారణ సెప్టెంబరు 15కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-08-02T22:01:26+05:30 IST