కుప్పం నేతలకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-09-23T20:24:43+05:30 IST
కుప్పం నేతల (Kuppam leaders)కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు నాయుడు,
Amaravathi : కుప్పం నేతల (Kuppam leaders)కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు నాయుడు, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, మునుస్వామి మరో నలుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) పర్యటన సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజులుగా టీడీపీ నేతలు చిత్తూరు జైలు (Chittor Jail)లో ఉన్నారు. చిత్తూరు కోర్టు (Chittor Court) బెయిల్ తిరస్కరించడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో ఏడుగురికి బెయిల్ మంజూరైంది.