పూడూరు సర్పంచ్గా కొనసాగడానికి బాబు యాదవ్కు హైకోర్టు గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
పూడూరు సర్పంచ్గా కొనసాగడానికి బాబు యాదవ్కు హైకోర్టు గ్రీన్సిగ్నల్
మేడ్చల్, జూలై 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్ మండలం పూడూరు సర్పంచిగా బాబు యాదవ్ను కొనసాగించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం బాబు యాదవ్ మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డర్ కాపీ అందుకున్నారు. ఏసీబీ కేసు అభియోగంలో పదవి కొల్పోయిన ఆయన్ని తొలుత సస్పెండ్ చేశారు. జిల్లా పంచాయతీ అధికారులు ఇచ్చిన సస్పెండ్ ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పదవి నుంచి తొలగించడం సరికాదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి మూడుమార్లు నోటీసులు ఇచ్చి 6నెలలు సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఆర్డర్పై బాబుయాదవ్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత ఇన్చార్జి సర్పంచ్ జ్యోతిని తొలగించి బాబు యాదవ్కు పదవి ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీంతో బాబు యాదవ్కు సర్పంచి కొనసాగడానికి పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.