వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-08-18T22:12:10+05:30 IST

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హైకోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్‌పై విచారించింది. ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా పడింది.

Updated Date - 2021-08-18T22:12:10+05:30 IST