జగన్ది నియంత పాలన..హైకోర్టు తీర్పే నిదర్శనం
ABN , First Publish Date - 2020-05-30T10:15:54+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ నియంతపాలన సాగిస్తున్నాడనడానికి ఎన్నికల కమిషనర్ తొలగింపుపై హైకోర్టు ఇచ్చిన
చంద్రదండు ప్రకా్షనాయుడు
అనంతపురం వైద్యం : ముఖ్యమంత్రి జగన్ నియంతపాలన సాగిస్తున్నాడనడానికి ఎన్నికల కమిషనర్ తొలగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని రాష్ట్ర మాంసోత్పత్తుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్రదండు ప్రకా్షనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే్షకుమార్ తొలగింపు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్నారు.
సీఎం నియంతృత్వ, నిరంకుశ పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్ అప్రతిష్టపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుబడుతున్నా జగన్ మొండిగా వ్య వహరించడం సరికాదన్నారు. కోర్టు తీర్పులకు నైతిక బాధ్యత వహించి సీఎం జగన్ రాజీనామా చేయాలని ప్రకా్షనాయుడు డిమాండ్ చేశారు.