కుప్పం పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిపై High courtలో పిటిషన్
ABN , First Publish Date - 2021-11-08T17:50:48+05:30 IST
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిని మార్చాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
అమరావతి: కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారిని మార్చాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది నర్రా శ్రీనివాస్ లంచ్ మోషన్ను ప్రస్తావించారు. కుప్పం ఎన్నికల ప్రత్యేక అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు... ప్రభుత్వ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరికొద్ది సేపట్లో లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.