అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-09-21T18:57:52+05:30 IST

అమరావతి: రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖలో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కాబట్టి దీనిపై సీఎస్ సంతకంతో కౌంటర్ ఇంకా దాఖలు చేయకపోవటంపై హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వం వారం రోజుల పాటు సమయం కోరింది. హైకోర్టు విచారణపై ఏపీ హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనిపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం వారం రోజుల పాటు సమయం కోరిందన్నారు. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని నిర్ణయించిందన్నారు. కేంద్రం అన్ని రిట్లకు సమాధానం ఇవ్వాలని కోరగా.. కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 




Updated Date - 2020-09-21T18:57:52+05:30 IST