రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-09-21T19:08:29+05:30 IST

రాజధాని రైతుల పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని రైతుల పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని విశాఖకు వెళ్లినా, వెళ్లకపోయినా అక్కడ గెస్ట్ హౌస్ కడతామని అంటున్నారని న్యాయవాది తెలిపారు. విశాఖలో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కాబట్టి... సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయకపోవటంపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో  కౌంటర్ దాఖలు చేయటానికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో అక్టోబర్ 5వ తేదీ నుంచి రెగ్యులర్ విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. కాగా రైతుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.

Updated Date - 2020-09-21T19:08:29+05:30 IST