గ్రామాల్లో హై అలర్ట్
ABN , First Publish Date - 2020-06-23T10:58:22+05:30 IST
మండలంలో కరోనా పాజిటివ్ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో అధి కారులు హైఅలర్ట్ ప్రకటించారు.
కంటైన్మెంట్ జోన్లలో హెచ్చరిక బోర్డులు
ఏలూరు రూరల్, జూన్ 22 : మండలంలో కరోనా పాజిటివ్ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో అధి కారులు హైఅలర్ట్ ప్రకటించారు. వెం కటాపురం పం చాయతీలోని దాదా పు 40 కేసులు నమోదు కావడంతో కొన్ని వీధులను దిగ్బంఽధించారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో రాక పోకలు సాగించద్దంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాలనీ వాసులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
కొందరు శ్వాబ్లు సేకరించి ల్యాబ్ కు పంపించారు. తాజాగా శనివారపుపేటలో ఓ ఇంట్లో కరోనా కేసు నమో దైన నేపఽథ్యంలో ఆప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లలో 14 రోజుల పాటు కఠిన నిబంధనలు పాటించాలని ఎంపీడీవో మనో జ్ పేర్కొన్నారు. ఆశ, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరా కాలనీలోనూ, కంటైన్మెంట్ జోన్లలోనూ ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. వీధుల్లో హైపోక్లోరినేషన్ చేశారు.