Mp Gorantla Madhav Video: జగన్ను ఇరకాటంలో పెట్టిందా?
ABN , First Publish Date - 2022-08-07T01:09:20+05:30 IST
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Hidupuram Mp Gorantla Madhav Video) సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై...
అమరావతి/HYderabad: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Hidupuram Mp Gorantla Madhav Video) సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై సీఎం జగన్ (Cm Jagan) సీరియస్గా ఉన్నారని.. ఏ క్షణమైనా చర్యలు తీసుకోవచ్చనే ప్రచారం జరిగింది. తప్పు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamaKrishna Reddy) సైతం హెచ్చరించారు. అయితే ఈ ప్రకటన చేసి మూడు రోజులవుతున్నా.. ఎంపీ గోరంట్ల మాధవ్పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఆ వీడియో గురించే మర్చిపోయినట్లుగా వారి తీరు ఉంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకునే వాళ్లూ సెలైంట్ అయిపోయారు. దీంతో వైసీపీ (Ycp) నేతలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు బాగోతం జగన్ను ఇరకాటంలో పెట్టిందా?. వేటు వేయాలని నిర్ణయించాక ఎందుకు జంకుతున్నారు?. కులం పట్టుకు వేలాడే జగన్ ఇప్పుడు కులానికే భయపడుతున్నారా?. విజయవాడ (Vijayawada) రమ్మనే అదేశాలను మాధవ్ ఎందుకు ధిక్కరించాడు?. మాధవ్ను సస్పెండ్ చేస్తారా?.. లేక అతనితోనే రాజీనామా చేయిస్తారా?. వైసీపీ ఫైర్ బ్రాండ్లు తేలు కుట్టిన దొంగల్లా అయిపోయారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..