ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానుల పూజలు
ABN , First Publish Date - 2021-05-17T18:25:24+05:30 IST
కరోనా బారిన పడిన ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానులు పూజలు నిర్వహించారు.
కర్నూలు: కరోనా బారిన పడిన ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానులు పూజలు నిర్వహించారు. జిల్లాలోని కౌతాళం మండలం మెళిగనూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆలయం ముందు 100 టెంకాయలు కొట్టారు.