ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు
ABN , First Publish Date - 2022-05-21T06:14:57+05:30 IST
పట్టణంలో జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సినీ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం, మే 20 : పట్టణంలో జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సినీ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలో భోజనాలను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్బాబు, ఎన్టీఆర్ అభిమానులు కేక్ను కట్ చేశారు. కోనేటి చంటి, ఈదుపల్లి అప్పారావు, శీలామంతుల రాంబాబు, కాగితాల రాంబాబు, ఏడుకొండలు అభిమానులు పాల్గొన్నారు.
టి.నరసాపురం: ఏపిగుంట గ్రామ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు తోట లక్ష్మీనారాయణ, టి.నరసాపురం మాజీ సర్పంచ్ జోనుబోయిన సోంబాబు, గండబోయిన శ్రీను, కాల్నీడి రాంబాబు, అభిమానులు పాల్గొన్నారు.
దెందులూరు : దెందులూరు, పోతునూరు, కేఽతవరం గ్రామాల్లో ఉమ్మడి జిల్లాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బోడేటి మోహన్ ఆధ్వర్యంలో 39 కేజీల భారీ కేక్ను నున్న లక్ష్మాణారావు, గొరిపర్తి గోవర్థన్, ప్రసాద్ తదితరులు కట్ చేసి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పప్పిశెట్టి మోహన్, ఆకుల రామకృష్ణ యాదవ్, దూదిపాల మధు యాదవ్, వేమన రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు.