హీరో నాని వ్యాఖ్యలను ఖండించిన బొత్స

ABN , First Publish Date - 2021-12-23T21:24:34+05:30 IST

హీరో నాని వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

హీరో నాని వ్యాఖ్యలను ఖండించిన బొత్స

 అమరావతి: హీరో నాని వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తాం. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి. అందుకే సినిమా టికెట్ల ధరలు తగ్గించాం. మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా?. మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదు. ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలి’’ అని బొత్స సత్యనారాయణ సూచించారు.


ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్ల కలెక్షన్‌ ఎక్కువైందన్నారు. టికెట్‌ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని చెప్పారు. తన పేరు ముందు నేచురల్‌ స్టార్‌ తీసేద్దాం అనుకుంటున్నానని తెలిపారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే తమ లక్ష్యమని, లాభనష్టాలు మాత్రం తర్వాత చూసుకుంటామని నాని తెలిపారు.

Updated Date - 2021-12-23T21:24:34+05:30 IST