500 అడుగుల జాతీయ జెండాతో హెరిటేజ్ వాక్
ABN , First Publish Date - 2022-08-12T08:53:52+05:30 IST
500 అడుగుల జాతీయ జెండాతో హెరిటేజ్ వాక్
కర్నూలు నగరంలో గురువారం జిల్లా పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో 500 అడుగుల జాతీయ జెండాతో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పాత కంట్రోల్ రూం నుంచి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన వాక్ను మేయర్ బీవై రామయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి బీ వెంకటేశ్వర్లు, సెట్కూర్ సీఈవో రమణ ప్రారంభించారు. కార్యక్రమంలో భారీసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. - కర్నూలు(న్యూసిటీ)