Towel తెచ్చివ్వలేదని భార్యను ఇలా...

ABN , First Publish Date - 2021-11-08T22:38:09+05:30 IST

కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

Towel తెచ్చివ్వలేదని భార్యను ఇలా...

భోపాల్: స్నానం చేశాక టవల్ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ భర్త రెచ్చిపోయాడు. పారతో ఆమె తలపై బాది హతమార్చాడు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాజ్‌కుమార్ బాహే అటవీశాఖలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. 


ఆదివారం సాయంత్రం బాత్రూములో దూరిన అతడు స్నానం అనంతరం టవల్ తెచ్చివ్వమని భార్యను అడిగాడు. అయితే, ఆ సమయంలో వంట పాత్రలు శుభ్రం చేస్తున్న ఆమె కాసేపు ఆగాలని కోరింది. అంతే, ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్‌కుమార్ బయటకు వచ్చిన పారతో తన భార్య పుష్పాబాయి (45) తలపై గట్టిగా మోదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. 


తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 23 ఏళ్ల కుమార్తెను కూడా బెదిరించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-08T22:38:09+05:30 IST