ప.గో జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-01-16T00:57:30+05:30 IST

జిల్లాలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.

ప.గో జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు

ఏలూరు:  పశ్చిమగోదావరి జిల్లాలో  కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో  డోన్ మండలం సీసం గుంతలలోని కొండల్లో ఉన్న కోడి పందాల స్థావరాల్లో కోడి పందాలు ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి మూడు బైక్‌లు, మూడు పుంజులు, రూ.4 వేలు, 8 సెల్‌ఫోన్లు, నాలుగు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కోడి పందాల స్థావరాల వద్ద నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-16T00:57:30+05:30 IST