హేమంత్ కేసులో 25 మంది ప్రమేయం: పోలీసులు
ABN , First Publish Date - 2020-09-29T18:31:18+05:30 IST
హేమంత్ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్య కేసులో 25 మంది ప్రమేయం ఉన్నట్లుగా గచ్ఛిబౌళి పోలీసులు తేల్చారు. ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో నలుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కాగా కొద్ది సేపటి క్రితం అవంతితోపాటు హేమంత్ తల్లిదండ్రులు గచ్ఛిబౌళి పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారి స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేస్తున్నారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తి వల్ల తనకు ప్రాణహాని ఉందని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని అవంతి పోలీసులకు తెలిపింది.