ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధంకావాలి

ABN , First Publish Date - 2020-12-05T07:01:01+05:30 IST

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ మండలాధ్యక్షుడు దున్నా సత్యనారాయణ అన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధంకావాలి

తాళ్లరేవు, డిసెంబరు 4: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ మండలాధ్యక్షుడు దున్నా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం లయన్స్‌క్లబ్‌హాల్‌లో కార్యదర్శి వాడ్రేవు వీరబాబు అధ్యక్షతన  జరిగిన టీడీపీ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి వెంకటరమణ, వుంగరాల వెంకటేశ్వరరావు, కుడిపూడి రామకృష్ణ, మాజీసర్పంచ్‌ వాసంశెట్టి శ్రీనివాస్‌, అల్లూరి రామకృష్ణంరాజు  పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T07:01:01+05:30 IST