గిరిజన రైతుకు చేయూత
ABN , First Publish Date - 2022-05-18T05:55:16+05:30 IST
గిరిజన రైతుకు చేయూత
- గోశాల నుంచి రెండు ఆవులు, ఎద్దు అందజేత
బషీరాబాద్, మే 17: గిరిజన రైతుకు గోశాల సేవా సమితి నిర్వాహకులు చేయూత నందించారు. ఆ బాధిత రైతుకు ఒక ఎద్దు, రెండు ఆవులను మంగళవారం అందజేసి రైతు కుటుంబానికి ఆసరాగా నిలిచారు. కాగా, ఈ నెల 13న బషీరాబాద్ మండలం బహుద్దూర్పూర్ తండాకు ఆనుబంధంగా ఉన్న కాశీంపూర్ తండాలోని మిట్టునాయక్కు చెందిన ఒక ఎద్దు, రెండు ఆవులు పిడుగుపడి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో తాండూరులోని గోశాల సేవా సమితి నిర్వాహకులు పత్రికల్లో వచ్చిన కథనాన్ని చదివి.. ఆ రైతును తమ వంతుగా సహకారం అందించాలని ముందుకు వచ్చారు. ఈ విషయమై బహుద్దూర్పూర్ తండా సర్పంచ్ నీలిబాయికి ఫోన్ చేసి గిరిజన రైతు సమాచారం తీసుకున్నారు. రైతు మిట్టునాయక్ను గోశాలకు పిలిపించుకుని ఎద్దు, రెండు ఆవులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్కుమార్, సంయుక్త కార్యదర్శి సంజయ్ సారడా, సర్పంచ్ భర్త పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.