మృతి చెందిన అధ్యాపకుని కుటుంబానికి సాయం

ABN , First Publish Date - 2021-06-22T05:25:18+05:30 IST

కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తూ కరోనా బారినపడి గత నెల చనిపోయిన ఎం.వెంకటరావు కుటుంబానికి కళాశాల అధ్యాపకులు, ఇతర దాతలు రూ.3.5 లక్షల రూపాయల సాయం అందించారు.

మృతి చెందిన అధ్యాపకుని కుటుంబానికి సాయం
నగదు అందిస్తున్న ఎమ్మెల్సీ రఘువర్మ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణ

కంచరపాలెం,జూన్‌ 21 : కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తూ కరోనా బారినపడి గత నెల చనిపోయిన ఎం.వెంకటరావు కుటుంబానికి కళాశాల అధ్యాపకులు, ఇతర దాతలు రూ.3.5 లక్షల రూపాయల సాయం అందించారు. సోమవారం కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ హాజరై ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణతో కలిసి బాధితుని కుటుంబ సభ్యులకు ఈ మొత్తం అందించారు. ఈ సందర్భంగా రఘువర్మ మాట్లాడుతూ గణిత విభాగంలో కాంట్రాక్టు అధ్యాపకునిగా వెంకటరావు ఉత్తమ సేవలందించారని ప్రశంసించారు.


అటువంటి వ్యక్తి చనిపోయి కుటుంబం కష్టాల్లో పడినప్పుడు మానవత్వంతో ఆదుకున్న కళాశాల అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌, పాలిటెక్నిక్‌ ఆల్‌మేథమెటిక్స్‌ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ బి.వి.లక్ష్మణరావు, జె.జయప్రకాష్‌రెడ్డి, ఎస్‌.కనకరావు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న వారికి మృతుని భార్య వరకనక సత్యవతి  కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:25:18+05:30 IST