నరకయాతన
ABN , First Publish Date - 2022-08-10T05:22:38+05:30 IST
నరకయాతన
- రెండు గంటలు స్తంభించిన ట్రాఫిక్
- ఇబ్బంది పడిన ప్రయాణికులు
దత్తిరాజేరు, ఆగస్టు 9: మానాపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతోపాటు వర్షానికి రహదారి చిత్తడిగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికితోడు రహదారిపై అడ్డంగా ఓ లారీ కూరుకుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింపోయింది. దీంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.