సెమీస్‌కు హైదరాబాద్‌, చెన్నై జట్లు

ABN , First Publish Date - 2021-01-14T05:07:02+05:30 IST

కొండముంజులూరులో జరుగుతు న్న దక్షిణ భారత స్థాయి టీ-20 క్రికెట్‌ పోటీల్లో జయింట్స్‌ హైద రాబాద్‌, ఎంఆర్‌సీసీ చెన్నై జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి.

సెమీస్‌కు హైదరాబాద్‌, చెన్నై జట్లు
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను అందుకుంటున్న చెన్నై క్రీడాకారుడు కుమారగురు



పంగులూరు, జనవరి 13 : కొండముంజులూరులో జరుగుతు న్న దక్షిణ భారత స్థాయి టీ-20 క్రికెట్‌ పోటీల్లో  జయింట్స్‌ హైద రాబాద్‌, ఎంఆర్‌సీసీ చెన్నై జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం జీపీకే జయింట్స్‌ హైదరాబాద్‌పై కెప్టెన్‌ లెవెన్స్‌ బ ళ్లారి జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 196 ప రుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బళ్లారి జట్టు  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓడిపోయింది.  21 బంతులలో 48 పరుగులు చేసిన ఆకాష్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. మరోమ్యాచ్‌లో శ్రీసీసీ చెన్నై జట్టుపై పోటీ పడిన ఎంఆర్‌సీసీ చెన్నై బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అనంతరం శ్రీసీసీ చెన్నై జట్టు 121 పరుగులకే ఆలౌట్‌ అయ్యి ఓటమి చెందింది. కుమారగురు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.  


నేడు సెమీ ఫైనల్స్‌


గురువారం ఉదయం టైలర్స్‌ చిల కలూరిపేట,  జీపీకే జయింట్స్‌ హైదరాబాద్‌ మధ్య పోటీ జరగ నుండగా, సాయంత్రం ఎంఆర్‌సీసీ చెన్నై, అరుణా ఇన్‌ఫ్రా ఒంగో లు జట్లు తలపడనున్నాయి.  


Updated Date - 2021-01-14T05:07:02+05:30 IST