గుంతలో బోల్తాపడ్డ లారీ..వరంగల్-కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..

ABN , First Publish Date - 2021-03-01T16:59:34+05:30 IST

వరంగల్ టూ కరీంనగర్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారింది. గత వర్షాకాలంలో పడిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయి. వరంగల్-కరీంనగర్ హైవేపై

గుంతలో బోల్తాపడ్డ లారీ..వరంగల్-కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..

వరంగల్ అర్బన్ : వరంగల్ టూ కరీంనగర్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారింది. గత వర్షాకాలంలో పడిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయి. వరంగల్-కరీంనగర్ హైవేపై భారీ గుంతలు ఏర్పడటంతో రోజుకో ప్రమాదం జరుగుతుందని ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి టూ వరంగల్‎కు వెళ్తున్న లారీ..రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో బోల్తాపడింది. లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో వరంగల్ - కరీంనగర్ హైవేపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2021-03-01T16:59:34+05:30 IST