Andhra news: జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-07-30T15:00:57+05:30 IST

జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట జాతీయ రహదారిపై భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Andhra news: జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టివేత

ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట జాతీయ రహదారిపై భారీగా గంజాయి(Cannabis)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇన్నోవా కార్లో గంజాయిని తరలించేందుకు యత్నించారు. కాగా కప్పలకుంట వద్ద  పంచర్ అవడంతో కారును ఆపారు. అదే సమయంలో అక్కడకు వచ్చి పెట్రోలింగ్ పోలీసులను చూసిన నిందితులు కారును వదిలి పరారయ్యాడు. సుమారు 350 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-07-30T15:00:57+05:30 IST