తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-06-12T01:35:52+05:30 IST
Tirupati: తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సెక్టార్కి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూ లైన్లలోని
Tirupati: తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సెక్టార్కి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందన్నారు. రేపు రాత్రికి భక్తుల తాకిడి తగ్గే అవకాశం ఉందన్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని.. భక్తులు ఓపికగా క్యూ లైన్లలో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకోవాలని ఈవో కోరారు.