భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-09-19T01:51:00+05:30 IST

జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమ గోదావరి : జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్న గూడెం గ్రామం నుంచి అక్రమంగా బొలెరో వాహనంలో 50 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. బొలెరో వాహనాన్ని సీజ్  చేసారు.  రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


ప్రకాశం జిల్లాలో  

 ప్రకాశం: జిల్లాలోని  ఉలవపాడు దగ్గర రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై చిలకలూరిపేట నుంచి కావలికి అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్నిస్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-19T01:51:00+05:30 IST