అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-08-14T16:33:16+05:30 IST

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

విశాఖ: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం రెండు రోజుల్లో మరింతగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఇవాళ, రేపు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రా తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2020-08-14T16:33:16+05:30 IST