ఢిల్లీ, ముంబైలో ఏకధాటిగా వర్షం

ABN , First Publish Date - 2020-08-14T06:46:40+05:30 IST

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 10.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది...

ఢిల్లీ, ముంబైలో ఏకధాటిగా వర్షం

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది.  24 గంటల వ్యవధిలో అత్యధికంగా 10.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కొన్ని రోడ్లపై నడుము లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు ఢిల్లీలో సాధారణం కన్నా 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది.


ముంబైలో పలు ప్రాంతాల్లో 7-10 సెం.మీ. వర్షం కురిసింది.  కేరళలో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. రాగల రెండు మూడు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ మధ్య.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి నైరుతి రుతుపవనాలతో పాటు అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న తేమ గాలుల ప్రభావం తోడవడంతో.. భారీ వర్షాలకు అవకాశం ఏర్పడిందని తెలిపింది.  


Updated Date - 2020-08-14T06:46:40+05:30 IST