గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం
ABN , First Publish Date - 2020-07-14T02:35:20+05:30 IST
జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి..
గుంటూరు: జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పిడుగురాళ్ల 12 వార్డు సచివాలయంతో పాటు పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. పలుచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల రోడ్లపైకి నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. చీకటికావడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.