నగరంలో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-07-03T09:57:34+05:30 IST
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నగరంలో రోజు విడిచి రోజు భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నగరంలో రోజు విడిచి రోజు భారీ వర్షం కురుస్తోంది. గత 5 రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో నగరజీవనం అతలాకుతలమైంది. రోడ్లపై వరదనీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం రాత్రి 9.12 నుంచి 9.48 వరకు కుండపోతగా కురిసిన వర్షంతో వరదనీరు ప్రవహించింది. దాదాపు అరగంట పాటు కురిసిన వర్షంతో ఇళ్ల ఎదుట నీరు నిలిచింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇదిలా ఉండగా, అత్యధికంగా రాజేంద్రనగర్లోని ఏఆర్ఎస్ వద్ద 82.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ వద్ద 40.3, పటాన్చెరులోని పాశమైలారంలో 35.8, ఆల్విన్ కాలనీలో 25.0, జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప వద్ద 24.5, హైదర్నగర్లోని హెచ్ఎంటీ హిల్స్లో 18.8, గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 17.8, విజయనగర్ కాలనీలో 17.3మిల్లీమీటర్లు కురిసింది. అత్యల్పంగా శ్రీనగర్కాలనీ, గౌతంనగర్, యూస్ఫగూడలో 6.5, కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ, అత్తాపూర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద 6.3 మిల్లీమీటర్లు నమోదైంది.