మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-11-23T23:08:44+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా
మహబూబాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కేసముద్రం మండలంలోని ఇనుగుర్తిలో భారీ వర్షం పడింది. రాముతండా వడ్ల కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసింది. నీటిలో ధాన్యం కొట్టుకు పోయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.