పారిశ్రామిక ప్రాంతంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-18T04:49:32+05:30 IST

గాజువాకలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు చేరింది.

పారిశ్రామిక ప్రాంతంలో భారీ వర్షం
వర్షానికి నీట మునిగిన హౌసింగ్‌ బోర్డు మైదానం

గాజువాక, జూన్‌ 17: గాజువాకలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు చేరింది.  వాతావరణం చల్లబడింది. హౌసింగ్‌ బోర్డు మైదానంలో భారీగా నీరు చేరింది. 


శ్రీనగర్‌: పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీనగర్‌, వడ్లపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడలలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా మేఘాలు కమ్ముకుంటున్నప్పటికీ, చినుకు జాడ కనిపించలేదు. అయితే గురువారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో స్థానికులకు సాంత్వన లభించింది.  వాతావరణం చల్లబడడంతో ప్రజలంతా సేద తీరారు. రోడ్లపై నీరు నిలిచింది. పలు లోతట్టు రహదారుల్లోకి వరద నీరు చేరి, జలమయమయ్యాయి. 

Updated Date - 2021-06-18T04:49:32+05:30 IST