భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-06-20T05:51:57+05:30 IST
సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్బాష పేర్కొన్నారు.
సోమందేపల్లి(పెనుకొండ టౌన), జూన 19: సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్బాష పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటరమణ, సోమందేపల్లి మండల వ్యాప్తంగా సిబ్బందితో అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారన్నారు. ఈ క్రమంలో 18 మందిని అరె్స్టచేసి వారి నుంచి 12 ద్విచక్రవాహనాలు, రూ.లక్ష విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హిందూపురానికి చెందిన హిదాయతుల్లా కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించాడు. అతడిని కూడా అరె్స్ట చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వెల్లడించారు.