భారీగా బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-03-26T14:43:51+05:30 IST

అనుమతి లేకుండా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పోలీసులు

భారీగా బంగారం పట్టివేత

కర్నూలు: అనుమతి లేకుండా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధముందని భావిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన బంగారం వ్యాపారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-03-26T14:43:51+05:30 IST